telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నేటి పవన్ ప్రచారం రద్దు.. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు..

pavan today campaign schedule cancelled

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స పూర్తికావడంతో డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం విజయనగరంలో పర్యటించిన పవన్ అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న పవన్‌కు విమానాశ్రయంలోని రమేశ్‌ హాస్పిటల్‌ టెలిమెడిసిన్‌ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వెళ్లి ఆయుష్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో జరగాల్సిన పర్యటనలను జనసేనాని రద్దు చేసుకున్నారు.

వైద్యులు పవన్‌ను ఐసీయూలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పవన్ నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, పవన్ డిశ్చార్జ్ విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

కాగా, ఇలాంటి హాస్పిటల్ నాటకం పై ఇటీవల వైసీపీ అధినేత జగన్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబుపై అనేక వార్తలు వచ్చాయి. సానుభూతి కోసం వీరిరువురు ఇలాంటి ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సీన్ తెరపైకి తేవాలని యోచిస్తున్నట్టు గా ఆ వార్తలు బాగానే సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేశాయి. అయితే ఇంతలోనే పవన్ ఆ సీన్ లో ప్రత్యక్షమవడం పై .. జనసేన ఒక అడుగు ముందే ఉందే అంటూ విమర్శలు వస్తున్నాయి. అయినా ఈ హాస్పిటల్ తతంగం అంతా నిజం అని పవన్ విషయంలో నమ్మవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు సున్నితంగా షూటింగ్ లతో కాలం గడిపి ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి ఇంత కష్టపడటంతో అది తట్టుకోలేకే ఇలా అవడం చాలా సహజం అని అందరికి తెలిసిందే. 

Related posts