telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గెలుపోటములపై .. జనసేనాని మరోసారి సమీక్ష..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరులో పర్యటించారు. అక్కడ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దాదాపు సంవత్సరం క్రితం నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు తాను హాజరు అయ్యాయని జనసేనాని తెలిపారు. మళ్లీ ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. జిల్లాలో పార్టీ పటిష్టతపై ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించామని చెప్పారు. జూలై రెండో వారం నుంచి 175 నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం గట్టిగా పనిచేసిన 15-30 మంది జనసేన కార్యకర్తలను పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించుకుంటామని చెప్పారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయి? పోలింగ్ సందర్భంగా జరిగిన తప్పులు ఏంటి? అనే విషయాన్ని సమీక్షిస్తానని తెలిపారు.

పార్టీ ప్రజలకు అండగా ఉంటానికే పెట్టమని, ఆ మాట నిలబెట్టుకుంటామని మరోసారి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. అమరావతిలోని ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ..‘పర్యావరణ నిబంధనలను అతిక్రమించే ప్రదేశం ఈ భారతదేశం. నిబంధనలు అతిక్రమించే పెద్దస్థాయి వ్యక్తులయినా, చిన్నస్థాయి వ్యక్తులు అయినా అందరికీ సమానంగా న్యాయం జరగాలి. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

Related posts