telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ .. రాష్ట్ర పర్యటన .. త్వరలో ..

janasena manifesto on formation day

జనసేన తొలి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ పాలన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం రెండు నెలలు మాత్రమే గడిచిందని, కాస్త పాలన పై పట్టు సాధించడానికి మరొ కొద్ది రోజులు సమయం ఇద్దామని ఆ తరువాత కూడా పాలన తీరు మారకపోతే అప్పుడు జనసేన తరుపున ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాగా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలో నేనే తిరిగి అందరిని కలుస్తానని, జనసైనికుల పై దాడులు జరగకుండా స్థానిక నేతలు తోడుగా ఉండాలని కోరారు.

ఈ ఎన్నికలలో సమయం తక్కువగా ఉండడం వలన అన్ని చోట్ల తిరగలేకపోయానని, అయినా ఓటమి వలన చాలా మంది నేతలు పార్టీనీ వీడారని అది కూడా మన మంచికే జరిగిందని, వచ్చే ఎన్నికలలో అసలైన నాయకులే మన వెంట నిలబడతారని జనసేన కూడా ఏదో ఒక రోజు బలమైన శక్తిగా మారుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చెయ్యడానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళితేనే జనసేన పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అలా కాకుండా ఎప్పటిలాగే ఓ మీటింగ్ పట్టి ఆవేశంగా ఒక స్పీచ్ ఇచ్చి మళ్లీ సైలెంట్ అయిపోతే.. పవన్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగులుతుంది. మరి పవన్ తన అభిమానుల కోసమైనా తగిన ప్రణాళికలతో వస్తేడమో చూడాలి.

Related posts