telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

టీడీపీలో చేరిన .. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ..

patil joined in tdp

ఏపీలో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకపక్క అసంతృప్తులతో తలమునకలవుతుంటే, మరోపక్క సీటు దక్కిన వాళ్ళు కూడా వలసలబాట పట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా, సీనియర్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంది. అనంతపురంలో జరిగిన సీఎం ఎన్నికల ప్రచారసభలో మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు సమక్షంలో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఆయన సోదరుడు సదాశివరెడ్డి, తనయుడు అజయ్‌కుమార్‌ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు పదుల సంఖ్యలో నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Related posts