ఆపరేషన్స్ కారణాలతో 13 ప్యాసింజర్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. జనవరి 1,2020 నుంచి జూన్ 30, 2020 వరకు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలక్నుమా, ఉమ్దానగర్, సికింద్రాబాద్, బొల్లారం, మేడ్చల్, మనోహరబాద్ మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేశారు.
ఇందులో సికింద్రాబాద్-మేడ్చల్, ఫలక్నుమా- మేడ్చల్, ఫలక్నుమా-ఉమ్ధానగర్, బొల్లారం -ఫలక్నుమా, ఫలక్నుమా-మనోహరబాద్, సికింద్రాబాద్ – మనోహరబాద్, సికింద్రాబాద్-ఉమ్ధానగర్, ఫలక్నుమా- భువనగిరి మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.