telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఆరు నెలల పాటు.. 13 పలు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

special train between vijayawada to gudur

ఆపరేషన్స్‌ కారణాలతో 13 ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. జనవరి 1,2020 నుంచి జూన్‌ 30, 2020 వరకు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలక్‌నుమా, ఉమ్దానగర్‌, సికింద్రాబాద్‌, బొల్లారం, మేడ్చల్‌, మనోహరబాద్‌ మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేశారు.

ఇందులో సికింద్రాబాద్‌-మేడ్చల్‌, ఫలక్‌నుమా- మేడ్చల్‌, ఫలక్‌నుమా-ఉమ్ధానగర్‌, బొల్లారం -ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-మనోహరబాద్‌, సికింద్రాబాద్‌ – మనోహరబాద్‌, సికింద్రాబాద్‌-ఉమ్ధానగర్‌, ఫలక్‌నుమా- భువనగిరి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Related posts