ఈ నెల 1 నుంచి 5 వరకు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా కాజీపేట – కొండపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగే రైల్వే మరమ్మతు పనుల దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రద్దు అయిన రైళ్లలో కాజీపేట – మణుగూర్ మధ్య నడిచే (57657-) మణుగూర్ ప్యాసింజర్ అప్ అండ్ డౌన్, కాజీపేట – అజ్నీ మధ్య నడిచే అజ్నీ ప్యాసింజర్ (57135 -) అప్ అండ్ డౌన్, ఈ రెండు రైళ్లు ఈ నెల 5వ తేదీ వరకు రద్దు చేశారు.
ఇదిలా ఉండగా కాజీపేట – విజయవాడ మధ్య నడిచే విజయవాడ ప్యాసింజర్ (57237) రైలు ఈ నెల 2 వరకు రద్దు చేశారు. బల్లార్ష – కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రామగిరి ప్యాసింజర్ (67204) రైలు బల్లార్ష నుంచే వచ్చే డౌన్ ట్రిప్పును మాత్రమే సోమవారం రద్దు చేశారు. ప్రయాణికులు రదైయిన రైళ్ల వివరాలు గమనించాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.