చైనాకు చెందిన ఓ యువతి వింత కారణంతో విమానంలోని మిగతా ప్రయాణికులందర్నీ భయపెట్టింది. అంతేకాదు వారి ప్రాణాలకు కూడా ముప్పుతెచ్చింది. విమానం గాల్లోకి లేచే సమయంలో చల్లగాలి కావాలంటూ విమానం టేకాఫ్ సమయంలో సడెన్గా ఎమర్జెన్సీ డోర్ తెరిచేసింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా పట్టించుకోలేదు. దీంతో భయభ్రాంతులకు గురైన వారు పెద్దగా అరుస్తూ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది… తలుపులు మూయాలని ఆమెకు చెప్పారు. వారి మాటలు పట్టించుకోని సదరు యువతి.. తనకు ఒంట్లో ఇబ్బందిగా ఉందని, చల్లగాలి కావాలని చెప్పింది. అందువల్ల తలుపులు మూయడం కుదరదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఏం చేయాలో తోచని విమాన సిబ్బంది.. ఎయిర్పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్టు అధికారులు వెంటనే రంగంలోకి దిగి సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 23న చైనాలో జరిగింది. ఆ యువతి చేసిన పనివల్ల విమానం దాదాపు గంట ఆలస్యంగా బయలుదేరింది. షియామెన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరలయింది.
previous post
next post