telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పంజాగుట్ట నుంచి 47 బస్ ఎక్కాలంటే.!

Passengers troubles in 47 root Hyderabad

సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే 47నంబర్ గల సిటీ బస్.. మార్గమధ్యలోని పంజాగుట్ట వద్ద ఎక్కాలంటే సాహసం చేయాల్సిందే. ఈ మార్గంలో తగినన్ని బస్సులు లేకపోవడంతో ఉదయంపూట ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు అధికంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణీకుల రద్దీతో బస్సులు కిటకిటలాడుతుంటాయి. మహిళలు, వృద్దులు రద్దీగా ఉన్న బస్సులు ఎక్కాలంటే ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు.

పరిమిత బస్సులు తిరిగే ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో ప్రయాణీకులు సిటీ బస్సులో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకొంటారు. ఈ రూటు లో నడిచే బస్సులు తక్కువగా ఉండడంతో తాము ప్రయాణంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఈ మార్గంలో అదనంగా బస్సులు నడపాలని నిత్యము రాకపోకలు సాగించే ప్రయాణీకులు కోరుతున్నారు.

Related posts