రేపు విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. దీనిపై పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫిరెన్స్ లో నేతలతో మాట్లాడిన ఆయన రేపు రెండోసారి రాష్ట్రస్థాయి సమావేశం జరుపుకుంటున్నామని, రెండు నెలల వైసీపీ పాలనలో మనపై దాడులు పెరిగాయని, ప్రభుత్వ వైఖరి వలన వివిధ వర్గాలు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు.
టీడీపీ కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వద్దని చెప్పారని, తప్పుడు విధానాలతో అనేక విధాలుగా వేధిస్తున్నారన్నారు. భౌతిక దాడులతో పాటు ఆర్ధిక మూలాలను కూడా దెబ్బతీస్తున్నారన్నారు. రేపటి సమావేశానికి నేతలంతా సమగ్ర వివరాలతో రావాలని చంద్రబాబు కోరారు.
బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్రెడ్డి