కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని నిశ్చయించుకుంది. ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదని… కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి అడ్డుకునేందుకు నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ డిమండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో.. మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు. అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం మనం డిసెంబర్ మధ్యలో ఉన్నామని.. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు మంత్రి జోషి. బడ్జెట్ సమావేశాలను వచ్చే జనవరిలో నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
previous post