దేశరాజధానిలోని పార్లమెంట్లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ అనుబంధ భవనంలోని ఆరో అంతస్తులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండడంతో… మంటలను వెంటనే అదుపులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినప్పటికీ దర్యాప్తు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
previous post
next post
కొలిమిలో యువత భవిష్యత్తు..మోదీ సర్కార్ పై సోనియా ఫైర్