telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అక్కడ వైసీపీ తాగుబోతులు వచ్చి గొడవలు పడ్డారు…

టీడీపీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాన్ని సోమరిపోతులను చేసేలా ప్రభుత్వం పని చేస్తోందన్న ఆయన వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని అన్నారు. జిల్లాలో కలెక్టర్ ను  తిట్టిన వారున్నారు.. అదే కలెక్టర్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని అన్నారు. ముచ్చిరామిలో వైసీపీ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడన్న ఆయన రాప్తాడు నుంచి పెనుకొండ వరకు హైవేలో రియల్ దందా సాగుతోందని అన్నారు. చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ ఆఫీస్ శివారెడ్డి డాబాలో ఉందని, మీరు చేసే అరాచకాలు ప్రతిదానికి లెక్క ఉంటుందని అన్నారు. దీనిని వైసీపీ నేతలు, అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెన్నేకొత్తపల్లిలో కొందరు వైసీపీ తాగుబోతులు వచ్చి గొడవలు పడ్డారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టారని, మీ తాటాకు చప్పుళ్లకు, కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు.

Related posts