తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను శనివారం స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గవర్నర్ తో స్నేహపూర్వకంగానే భేటీ అయినట్టు ఆయన తెలిపారు. గవర్నర్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా వచ్చిన తర్వాత ఇప్పటివరకు కలవడం కుదరలేదని, అందుకే కలిశానని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా ఆయన స్పందిస్తూ ఆర్టీసీ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారుతోందని అన్నారు.