telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలి: ట్రస్మ

private schools collecting interest on late fee

హై కోర్టు తీర్పు ప్రకారం తల్లిదండ్రులు విధిగా పాతబకాయిలు, ఈ సంవత్సరం ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లను, ఉపాధ్యాయులను ఆదుకోవాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం( ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు కోరారు. గత 6 నెలలుగా ఉపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందుల గురవుతున్నారని తెలిపారు.

పాఠశాలలు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అద్యక్షలు మరియు కార్యధర్శి యాదగిరి శెఖర్ రావు,సాదుల మధుసూధన్ ఒక పత్రికా ప్రకటనలో కోరారు. ప్రైవేట్ పాఠశాలలు కొన్ని నెలలుగా పూర్తిగా లాక్ డౌన్ లో ఉండడం వల్ల యాజమాన్యాలు, సిబ్బంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు జీవన చిత్రం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు.

Related posts