హీరో ధనుష్ తమ కొడుకే అని, చిన్నతనంలో మందలిస్తే..ఇంటి నుంచి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నాన్చివేత దోరణిని అవలంభించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్కి షాక్ ఇచ్చింది. ధనుష్ జనన సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్ను ఆదేశించింది. మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ..తామెవరో తెలయదంటే భరించలేకపోతున్నాం అని కదిరేశన్ దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. డీఎన్ఏ టెస్ట్లు చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపారు. గతంలో ధనుశ్ పుట్టుమచ్చులు చెరిపించుకున్నాడనే వ్యవహారం కూడా సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ ప్రొఫిషన్లో భాగంగానే అలా చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు అతడు.
previous post
next post
ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు