telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో .. ప్యారడైజ్ ఫుడ్ కోర్టు..

paradise food court got place in limka book

అత్యధికులకు బిర్యానీ సర్వ్ చేసినందుకు గాను హైదరాబాద్ ప్యారడైజ్ ఫుడ్ కోర్టు కు సరికొత్త ఘనత దక్కించుకుంది. ఇరాన్ కు చెందిన ఈ వంటకం అంతగా భారతీయ సంస్కృతిలో భాగమైపోయింది. చికెన్, మటన్ తో పాటు శాకాహార ప్రియుల కోసం వెజ్ బిర్యానీలు కూడా ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్యారడైజ్ ఫుడ్ కోర్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఓ ఏడాది కాలంలో అత్యధిక మందికి బిర్యానీని సర్వ్ చేసి ప్యారడైజ్ ఫుడ్ కోర్టు రికార్డు సృష్టించింది.

2017 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 70,44,289 బిర్యానీలను ప్యారడైజ్ ఫుడ్ కోర్టు సర్వ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముంబైలో ఇటీవల జరిగిన ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సదస్సులో ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంతో తమకు ఔట్ లెట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Related posts