బిర్యానీ ప్రియులకు ఐపీఎల్ టిక్కెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్యారడైజ్ హోటల్. ప్యారడైజ్ హోటల్, కోకకోలా బెవరేజెస్ సంయుక్తంగా ప్యారడైజ్ సర్కిల్లో నమోదుచేసుకున్న రెగ్యులర్ కస్టమర్లకు బిర్యానీతో పాటు ఐపీఎల్ 2019 టిక్కెట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
ప్యారడైజ్ సర్కిల్ తమ రెగ్యులర్ కస్టమర్లను ఉత్సాహపరిచే విధంగా సోమవారం ఉప్పల్ వేదికగా రాజీవ్గాంధీ స్టేడియంలో జరగనున్న సన్రైజర్స్ వర్సెస్ కింగ్స్ పంజాబ్ మ్యాచ్ టిక్కెట్లను బహుకరించనుంది. గత 65 సంవత్సరాలుగా హైదరాబాద్ నగర సంస్కృతి, సంప్రదాయాలలో ప్యారడైజ్ భాగంగా ఉంది. మా నమ్మకమైన కస్టమర్లకు ఏదైనా కానుక ఇవ్వాలనే ప్రయత్నమే టిక్కెట్ల బహుమతులనిప్యారడైజ్ సీఈఓ గౌతమ్ గుప్త తెలిపారు.