నిన్న భారత్-ఇంగ్లాండ్ మధ్య పింక్ టెస్ట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఈ మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించింది. కేవలం రెండు సెషన్ లలోనే ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే నిన్ననే తమ మొదటి ఇనింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా ఆట ముగిసే సమయానికి 99 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఈరోజు తమ ఆటను ప్రారంభించిన భారత్ వేగంగా వికెట్లు కోల్పోతుంది. అయితే ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఆధిక్యంలోకి వచ్చిన భారత్ ఆ తర్వాత వెంటనే రహానే వికెట్ కోల్పోయింది. ఇక ఆ వెంట వెంట ఓవర్లలోనే రోహిత్, పంత్ వికెట్ లు కూడా చేజార్చుకుంది. దాంతో ప్రస్తుతం 121/6 తో నిలిచింది టీం ఇండియా. అయితే ఈ పడిన మూడు వికెట్ కూడా ఇంగ్లాండ్ జట్టులోని స్పిన్నర్ లేక్ పడ్డాయి. ఇక ప్రస్తుతం సుదర్(0), అశ్విన్(6) తమ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. చూడాలి మరి వీరు 7వ వికెట్ కు ఎంత భాగసామ్యం నెలకొల్పుతారు అనేది.
previous post
next post
లోకేష్ ఓ పప్పు.. అ ఆలు రావు: వైఎస్ షర్మిల