telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాన్ కార్డు తో .. ఆధార్ అనుసంధానానికి .. గడువు పెంపు ..

ఇకమీదట ఐటీ రిటర్నులు దాఖలు చేయాలనుకునే వాళ్లు తమ పాన్ కార్డులను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్రం కొన్నాళ్ల క్రితం ప్రకటన చేయడం తెలిసిందే. పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31వ తేదీని గడువుగా విధించారు.

ఈ గడువును మరో 6 నెలలు పెంచారు. 2019 సెప్టెంబరు 30వ తేదీని కొత్త గడువుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం తాజా ప్రకటన జారీ చేసింది. పాన్ కార్డుతో ఆధార్ ను 4 పద్ధతుల్లో అనుసంధానం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

Related posts