telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్‌ విమాన ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

narendra-modi

పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-303 విమానం . కరాచి విమానాశ్రయం సమీపంలోకుప్పకూలింది. లాహోర్‌ నుంచి కరాచీకి వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు నివాసాలపై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

Related posts