ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు ఓ ఫిర్యాదు వచ్చింది. ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ వద్ద పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు చేస్తూ కొందరు అలజడి రేపుతున్నారంటూ ఫిర్యాడు చేసిన వ్యక్తి తెలిపాడు. దీంతో స్థానిక పోలీసులు వెంటనే నినాదాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఈ నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు యులు మోటార్ బైకులపై అక్కడ చక్కర్లు కొడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారించారు. అయితే తాము పర్యాటకులమని, అందులో భాగంగా భారత్కు వచ్చామని చెప్పారు. అంతేకాకుండా యులు బైక్స్తో రేసింగ్ చేస్తున్నామని వారు అన్నారు. దాంతో ఈ క్రమంలో ప్రతి ఒక్కరిని తమతమ దేశాల పేర్లతో పిలుచుకున్నామని వారు తెలిపారు. వారిలో ఒకరు పాకిస్థాన్కు చెందిన అతడు ఉండటంతో ఆ నినాదాలు చేశామని చెప్పుకొచ్చారు. దాంతో ఈ విషయంపై మాట్లాడిన పోలీసులు పర్యాటకులు మామూలుగానే ఈ నినాదాలు చేశారని పోలీసులు దృవీకరించారు.
previous post
మెగాస్టార్, మంచు ఫ్యామిలీల మధ్యలో మనస్పర్థలు లేవు : మంచు విష్ణు