telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ తో పాటు బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా వాడుకున్న పాక్!

Surgical Strike 2Pakistan Indian air space

భారత్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన నివేధికలో కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును మాత్రమే పాకిస్థాన్ వాడుకోలేదు. బీజేపీని కూడా వివాదంలోకి లాగింది. హర్యాణా బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ శైనీల పేర్లను కూడా వాడుకుంది. వారు కశ్మీరీ మహిళలపై చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించింది.

లింగత్వాన్ని కూడా అస్త్రంగా బీజేపీ నేతలు వాడుకుంటున్నారని లేఖలో పాకిస్థాన్ తెలిపింది. జమ్ముకశ్మీర్ లో మారిన పరిణామాల నేపథ్యంలో, పార్టీలోని బీజేపీ వర్కర్లు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే… ఇప్పుడు మీరంతా తెల్లగా ఉండే కశ్మీరీ యువతులను పెళ్లి చేసుకోవచ్చు అని సైనీ చేసిన వ్యాఖ్యలను పాక్ వాడుకుంది. ఇప్పుడు కశ్మీర్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. పెళ్లికూతుళ్లను అక్కడి నుంచి తెచ్చుకుంటామని కొందరు చెబుతున్నారని మనోహర్ ఖట్టర్ పేర్కొన్నారని పాక్ తెలిపింది.

Related posts