పాకిస్తాన్కు చెందిన సీరియల్స్ చేస్తుందనే కోపంతో తన భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని సాలిస్బరిలో గత సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం హోర్డింగ్స్ వ్యాపారం చేసే ఆసీఫ్ సత్తార్ నయాబ్, తన భార్యా పిల్లలతో కలసి సాలిస్బరిలో నివసిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం పాల ప్యాకెట్ విషయంలో సత్తార్ నయాబ్కు అతని భార్యకు చిన్నపాటి గొడవ జరిగింది.
మళ్లీ భర్త షాపు నుంచి సాయంత్రం ఇంటికి తిరిగిరాగా భార్య అతనితో మాట్లాడకుండా అలిగి పడకగదిలోకి వెళ్లింది. భార్యతో మాట్లాడేందుకు భర్త పడకగదిలోకి వెళ్లగా, భర్తను పట్టించుకోకుండా భార్య తన మొబైల్ ఫోన్ లో ‘పాకిస్థాన్ డ్రామా’ అనే టీవీ సీరియల్ చూస్తోంది. పాకిస్థాన్ టీవీ సీరియల్ చూస్తూ భార్య తనను నిర్లక్ష్యం చేస్తుందనే కోపంతో నయాబ్ పక్కనే ఉన్న రాడ్తో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కుడిచేతి బొటనవేలు విరిగిపోయింది. గాయపడిన భార్యను ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పూణే పోలీసులు భర్త ఆసిఫ్ సత్తార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయాబ్ను అరెస్టు చేశారు.