telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం…16 మంది దుర్మరణం

Rail accident in Bihar 6 members Death

పాకిస్థాన్ లో గురువారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్సును అక్బర్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో 16 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 60 మందికి పై గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్వెట్టా నుంచి లాహోర్ కు బయల్దేరిన అక్బర్ ఎక్స్ ప్రెస్ పంజాబ్ ప్రావిన్స్ లోని రహీంయార్ ఖాన్ జిల్లా సాదికాబాద్ ప్రాంతంలో గూడ్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు ధ్వంసమయ్యాయి.

రైలు ప్రమాదం పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన రైల్వే వ్యవస్థపై మండిపడ్డారు. రైల్వే వ్యవస్థ ఇంకా పాత యుగంలోనే ఉందని విమర్శించారు. బ్రిటీష్ కాలం నాటివి ఇప్పటికీ వాడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ క్షమాపణలు చెప్పారు. విచారణకు ఆదేశించామని, రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తవుతుందని తెలిపారు.

Related posts