కశ్మీర్ లో ఆర్టికల్ 370 భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్తాన్ అట్టుదికిపోతుంది. ఈ నేపథ్యంలో పాక్ అధినాయకత్వం పీవోకే ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీవోకేలోని ముజఫరాబాద్ పట్టణానికి ‘బిగ్ జల్సా’ పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు.
పీవోకేలో తనకు ఘనస్వాగతం లభిస్తుందని ఆశించిన ఇమ్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజలు “గో బ్యాక్ నాజీ” అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా ‘కశ్మీర్ హిందుస్థాన్ సొంతం’ అంటూ ప్లకార్డులతో ఎదురొచ్చారు. ఇలాంటి పరిణామం ఇమ్రాన్ ఖాన్ ఏమాత్రం ఊహించనిది. కొన్నాళ్లుగా పీవోకే ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దీని పర్యవసానమే ఇమ్రాన్ కు చేదు అనుభవం రూపంలో ఎదురైంది.
వలసలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు: కుంతియా