telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం: సయ్యద్ అక్బరుద్దీన్

unsc akbaruddin

ఏ వేదిక మీద అయినా సరే పాకిస్థాన్ ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని భారత్ అత్యున్నత దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే అక్బరుద్దీన్ స్పందించారు. పాకిస్థాన్ ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.

అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుందన్నారు. ఇండియాకు కూడా వివిధ రకాల మార్గాలు ఉన్నాయని తెలిపారు. వివిధ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తాలని చూస్తే… అవే వేదికలపై ఆ దేశాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కోర్టులో ఇప్పటికే పాకిస్థాన్ ఒకసారి భంగపడిందని సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. నేవల్ అధికారి కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షకు సంబంధించి అంతర్జాతీయ కోర్టులో పాక్ కు పరాభవం ఎదురైందనే విషయాన్ని అక్బరుద్దీన్ గుర్తు చేశారు.

Related posts