telugu navyamedia
రాజకీయ వార్తలు

సరిహద్దుల్లో ముగ్గురు పాక్ సైనికులు హతం

kashmir police firing

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద భారత్-పాక్ జవాన్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పాక్ రేంజర్లు ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఈ ఉదయం కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి ముగ్గురు పాక్ సైనికులను హతమార్చారు.

సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో సరిహద్దుల వద్ద మాటు వేసిన ఉగ్రవాదులను కశ్మీర్ లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. అయితే పాక్ చర్యలను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు.

Related posts