telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది: ఇమ్రాన్ ఖాన్

imran on terrorism in UN

అవినీతి కారణంగా పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామాబాద్ లో అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు మాతృభూమి రుణం తీర్చుకోవడం ఎలాగో ప్రవాస భారతీయులను చూసి నేర్చుకోవాలని అన్నారు. భారత్, చైనా దేశాలకు చెందిన ప్రవాసులు తమ సొంత దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. వారి స్ఫూర్తితో పాకిస్థానీలు కూడా సొంతగడ్డను పరిపుష్టం చేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు, చైనీయులు తమ తమ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. తద్వారా ఆయా దేశాల ఆర్థికవ్యవస్థలు దూసుకుపోతున్నాయని తెలిపారు. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను మనకున్న గొప్ప ఆస్తిగా భావిస్తున్నామని, కానీ వారు దేశంలోని అవినీతి, లంచగొండితనం చూసి పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారని ఇమ్రాన్ పేర్కొన్నారు.

Related posts