పాకిస్థాన్లో పెళ్లి జరుగుతుండగా హిందూ వధువు అపహరణకు గురైంది. 24 ఏళ్ల వధువును అపహరించిన దుండగులు మతం మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. సింధ్ ప్రావిన్స్లోని హలా పట్టణంలో గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్ కిశోర్ అధికారుల నుంచి నివేదిక కోరారు. మరోవైపు, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు చెందిన సీనియర్ ఉద్యోగిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ కేబినెట్ లో సామాజికవర్గాలకు ప్రాధాన్యత: కృష్ణం రాజు