పాకిస్థాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రం ప్రాణాలు కోల్పోయారు. రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ నెల 23న పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. . విమానం కుప్పకూలిన ప్రాంతంలో ప్రదర్శనశాలలు, గోల్ఫ్ క్లబ్ లు, జిన్నా స్టేడియం ఉన్నాయి.
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి