యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించింది. పాకిస్థాన్ పైలట్లు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో తీసుకున్న ఈ నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది.
రానున్న డిసెంబరు 31 వరకు పీఐఏ విమానాల నిషేదం అమల్లో ఉంటుంది. 860 మంది పాక్ పైలట్లలో 262 మంది పైలట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడినట్టు బయటపడింది. ఇటీవల పాక్లో జరిగిన విమాన ప్రమాదం అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల గగనతలంపై పాక్ విమానాలు ప్రయాణించకుండా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.