పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్థాన్ వాసులు ఆందోళన చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ తోపాటు జమ్మూకశ్మీర్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యాన్ని నిరసిస్తూ ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలోని పాక్ రాయబార కార్యాలయం ముందు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్థాన్ వాసులు నిరసన తెలిపారు.
‘పాకిస్థాన్ డౌన్ డౌన్’ పాకిస్థాన్ శత్రువు అంటూ ప్ల కార్డులు చేతబట్టి ఆఫ్ఘాన్ వాసులు ఆందోళన జరిపారు. పెషావర్ నగరంలో గత నెల ఫస్టూన్ తహఫూజ్ ఉద్యమ నేత మంజూర్ ఫస్టీన్ తోపాతటు అతని 9 మంది అనుచరులను అరెస్టు చేసి 14 రోజుల జుడిషీయల్ రిమాండుకు పంపించడాన్ని నిరసిస్తూ అతన్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆఫ్ఘనిస్థాన్ వాసులు డిమాండు చేశారు.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్