క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్ధర్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. అతని కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని బోర్డు నిర్ణయించింది. కోచ్ ఆర్థర్తో పాటు సపోర్ట్ స్టాఫ్ను కూడా తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఇటీవల ఇంగ్లండ్ లో ముగిసిన వరల్డ్కప్లో పాక్ టీమ్ పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో పీసీబీ ఈ నిర్ణయం తీసుకోనున్నది. కాంట్రాక్టును రెన్యూవల్ చేయకూడదని నిర్ణయించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త్వరలో కొత్త కోచ్ కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలుపెట్టనున్నది. కోచ్ ఆర్థర్తో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లావర్, బౌలింగ్ కోచ్ అజర్ మొహ్మద్, ట్రైనర్ గ్రాంట్ లూడెన్ స్థానాల్లో కొత్త వారిని జట్టులోకి తీసుకోనున్నారు.