కరోనా వైరస్ దెబ్బకు పాకిస్తాన్ అల్లాడుతోంది. అసలే పేదరికంతో మగ్గుతున్న పాక్ ను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాక్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలను దాటడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు మొత్తం 50,694 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2,603 మందికి వైరస్ సోకింది.
ఇప్పటి వరకు పాక్ లో 1,067 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 15,201 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, వాస్తవంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.