telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ రాజకీయ

మూడవ వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్‌ ధారణ .. రాజకీయం చేస్తున్నారన్న పాక్ .. !

pak objection on team india with army cap

నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించిన విషయం తెలిసిందే. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి కి నివాళిగా భారత జట్టు ఆర్మీ క్యాప్‌లను ధరించింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

క్రికెట్‌ను రాజకీయం చేస్తున్న బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని పాక్ సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధరించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని మంత్రి ఫావద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు. ఆర్మీ క్యాప్‌లు ధరించి క్రికెట్ ఆడడం సరికాదు అని అన్నాడు.

Related posts