పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.పాకిస్థాన్ విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను భారత్ రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ లో భారత దురాగతాలంటూ పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
దీంతోపాటు అంతర్జాతీయ కోర్టులో విచారణలో ఉన్న కుల్ భుషణ్ కేసులోనూ పలు వ్యాఖ్యలు చేసినందున భారత్ ఫిర్యాదు మేర ఫైజల్ ట్విట్టర్ ఖాతాను రద్దు చేశారు. సోషల్ మీడియాలో ఫైజల్ పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నందునే అతని వ్యక్తిగత ఖాతాను రద్దు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.