telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కర్తార్‌పూర్‌ నడవా అంశం : .. భారత్ ప్రతిపాదనకు .. పాక్ సిద్ధం..

pak agreed to discuss on kartharpur issue

భారత్‌ ప్రతిపాదనకు మొదటిసారి పాక్ ఒప్పుకుంది. ఇరుదేశాల మధ్య వివిధ సమస్యలలో కర్తార్‌పూర్‌ నడవా అంశం ఒకటి కాగా, దానిపై భారత్ చర్చలకు రావాలని పాక్ కు ప్రతిపాదన పంపింది. ఆశ్చర్యంగా అనుదుకు సిద్ధం అంటూ, ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జులై 11 నుంచి 14 తేదీల మధ్య సంయుక్త కార్యదర్శుల స్థాయి సమావేశానికి తమకు సమ్మతమేనని తెలిపింది.

ఈ చర్చలు సఫలమైతే కర్తార్‌పూర్‌ ప్రాజెక్టుపై విధించిన చివరి గడువు నవంబర్‌ కల్లా పనులన్నీ పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాక్ చెబుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రాజెక్టుపై నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది.

Related posts