తెలంగాణ అసెంబ్లి డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరపున నామినేషన్ పత్రాలను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్లతో పాటు విపక్ష నేతలు శ్రీధర్బాబు, రాజాసింగ్, బలాల కూడా పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అంగీకరించాయి. ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిలతో సమావేశమైన కేటీఆర్ డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా కోరారు. కాగా డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది.