తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ పేరు ఖరారైంది. ఆయన శనివారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపింది. ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ తుది నిర్ణయం శనివారం ఉదయం వెల్లడిస్తామని ప్రకటించింది. సోమవారం ఎన్నిక జరుగనున్నది.
2004లో సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గతంలో పద్మారావుగౌడ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి కేబినేట్ లో స్థానం దక్కకపోవడంతో డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చెయ్యాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.