ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ గాయని పీ. సుశీల అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తమ ట్రస్టు ద్వారా ఎందరో కళాకారులకు ఆయన ప్రోత్సాహం అందించారని తెలిపారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలానే జగన్ కూడా ప్రజారంజక పాలన సాగించాలని సుశీల ఆకాంక్షించారు. ప్రజల దీవెనలతో ఆయన సీఎం అయ్యారని, ఆయనకు తన శుభాశీస్సులని అన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఎందరో కళాకారులను ఆయన ఆదుకున్నారని, జగన్ కూడా అదే విధమైన పాలన సాగించాలని అభినందించారు.