రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. జౌటర్పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం అవగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.ప్రమాదానికి గురైన కారు మేడ్చల్ నుంచి పఠాన్చెరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రిజిస్టేషన్ నంబర్ను(TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్కు చెందిన శ్రీదేవి పేరున ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.