సకాలంలో వేతనాలు రాకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు బుధవారం పరిపాలన భవనం ఆవరణలో ఆందోళనకు దిగారు. వేతనాలు రాకపోవడంపై గురువారం నుంచి మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఒకటో తేదీకే రావాల్సిన వేతనాలు మూడో తేదీ దాటినా రాకపోవడంపై నాన్ టీచింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓయూ ఉద్యోగ సంఘాలైన ఎన్జీవోస్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ నిధుల లేమితో వర్సిటీ అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో వర్సిటీకి రావాల్సిన నిధులురావడం లేదని ఆరోపించారు.
టీఆర్ఎస్ గతే వైసీపీకి పడుతుంది…