telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత

Nagarjuna

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున హోస్ట్‌గా రూపొంద‌నున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం 15 మంది సెల‌బ్రిటీల‌తో వంద రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ కార్య‌క్ర‌మంపై కొద్ది రోజులుగా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహ‌కులు త‌మ‌తో అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని బ్యాన్ చేయాల‌ని కోరారు. ఓయూ జేఏసీ కొద్ది సేప‌టి క్రితం నాగార్జున ఇంటిని చుట్టుముట్టి… బిగ్ బాస్ షోని నిలిపివేయాల‌ని నినాదాలు చేశారు. పోలిసుల రంగ ప్రవేశంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో వెంటనే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts