తన కొడుకుపట్ల చింపాంజీ చూపించిన ప్రేమకు ఓ తల్లి ఫిదా అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. మాంచెస్టర్కు చెందిన జెమ్మా కోప్లాండ్ (30), ఆమె భర్త షేన్ (31)తో కలిసి ఆస్ట్రియాలోని షోన్బ్రన్ జూను సందర్శించడానికి వెళ్లారు. జూను సందర్శించే సమయంలో తన 15 వారాల కొడుకు జాస్పర్కు పాలివ్వడానికి ఓ గాజు గోడ వద్ద కూర్చున్నారు. ఆమె తన కొడుకుకు పాలిచ్చే సమయంలో ఓ ముసలి ఆడ చింపాంజీ వారిని గమనించి.. ఆ గాజు గోడ వద్ద వచ్చి కూర్చుంది. కోప్లాండ్ తన కొడుకుకు పాలిచ్చినంతసేపు అక్కడే కూర్చుండిపోయిన చింపాంజీ.. మధ్య మధ్యలో ఆ బాబును హత్తుకుని, ముద్దాడే ప్రయత్నం చేసింది. చింపాంజీ తన కొడుకుపట్ల చూపిస్తున్న ప్రేమకు జెమ్మా కోప్లాండ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలను షేన్.. తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన జెమ్మా కోప్లాండ్.. షోన్బ్రన్ జూకు రావడానికి మొదటి తాను ఇష్టపడలేదన్నారు. అయితే ఇక్కడికి రాకపోయి ఉంటే.. మంచి అనుభూతిని కోల్పోయేదాన్నని తెలిపారు.
Video Credit : An Article