ఒప్పో సంస్థ ఎ3ఎస్ స్మార్ట్ఫోన్ను ధరను భారీగా తగ్గించింది. రూ.3వేల మేర డిస్కౌంట్ను ప్రకటించింది. దీని తో ఈ ఫోన్కు చెందిన 2జీబీ ర్యామ్ ఇప్పుడు రూ.10,990కి బదులుగా రూ.7,990 కే లభిస్తున్నది. అలాగే ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.13,990 కి బదులుగా రూ.9,990 ధరకే లభిస్తున్నది. ఈ క్రమంలో తగ్గిన ధరలకే ప్రస్తుతం ఈ ఫోన్ల వేరియెంట్లను కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో ఎ3ఎస్ స్మార్ట్ఫోన్లో 6.2 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.