telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఆన్ లైన్ లాటరీ టికెట్లు కొని.. ఐదుగురి ఆత్మహత్య

Crime

ఆన్ లైన్ లాటరీ టికెట్లు కొని ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం, సిద్ధేరి సమీపంలోని సలామత్ లో చోటు చేసుకుంది. అరుల్ అనే ఆభరణాల వ్యాపారి లాటరీ టికెట్లు కొనేవాడు. డబ్బంతా వాటికే ఖర్చు చేస్తుండడంతో అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన భార్య, ముగ్గురు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తానూ దాన్ని తాగడంతో వారందరూ మృతి చెందారు. అంతేకాదు, అతడు ఈ ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి, కొందరికి షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వెంటనే కొంత మంది అరుల్ ఇంటికి చేరుకుని, అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి ప్రవేశించారు. అయితే అప్పటికే ఐదుగురు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts