telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కిలో ఉల్లిగడ్డలు రూ.40..క్యూ కట్టిన ప్రజలు

onions

దేశ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల ధర కిలో రూ.100 నుంచి రూ.150 మధ్య పలుకుతోంది. ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతు బజార్ కు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి వచ్చింది. దీంతో ఒక్కొక్కరికి రెండు కిలోల మేర ఉల్లిగడ్డలను విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిగడ్డలు రూ.40 చొప్పున రాయితీపై విక్రయిస్తుండడంతో ప్రజలు క్యూలో నిలబడి తీసుకుంటున్నారు.

ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. ఈజిప్టు, టర్కీ నుంచి భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే, భారత్‌కు ఉల్లి ఎగుమతి చేసేందుకు పోటీ నెలకొనడంతో టర్కీ మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడం మొదలు కావడంతో వాటి ఎగుమతిపై టర్కీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈజిప్టు నుంచి మాత్రమే ఇండియాకు ఉల్లి దిగుమతి అవుతోంది.

Related posts