telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కాలనీల మధ్య గొడవకు కారణమైన డ్రైనేజీ వాటర్…

తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడిక్కక్కడే నిలిచిపోతున్నాయి. ఆ కారణంగా వనస్థలిపురం హరిహరపురం, స్నేహమయి కాలనీల మధ్య గొడవ నెలకొంది. అందువల్ల ఎలాంటి అనుమతులు లేకుండా అర్థరాత్రి జేసీబీలతో తవ్వకాలు జరుపుతుండగా అడ్డుకున్నారు స్నేహమయి కాలేజీ వాసులు. తవ్వకాలు దింపితే సుమారు పది కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని స్నేహమయి కాలనీ వాసులు అంటున్నారు.ఇప్పటికే నెల రోజులుగా డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్నామంటున్న కాలనీ వాసులు గగోలు పెడుతున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన తమ పై హరిహరాపురం కాలనీవాసులు దాడి చేశారు అన్ని స్నేహమయి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు తో హరిహరపురం కాలనీకి చెందిన నలుగురి పై కేసు నమోదు చేసారు వనస్థలిపురం పోలీసులు. అయితే తెలంగాణలో మరో రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖా అధికారులు అంటున్నారు.

Related posts