వన్ప్లస్ మొబైల్ ఉత్పాదక సంస్థ 7టి పేరిట కొత్త మొబైల్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన వన్ప్లస్ 7కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చారు. దిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో వన్ప్లస్ టీవీని కూడా తీసుకొచ్చారు. ఫోన్ ధర, ఇతర వివరాలు ఓ సారి పరిశీలిద్దాం..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ/128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.37,999గా పేర్కొంది. 8జీబీ/256 జీబీ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించింది. సెప్టెంబర్ 28 నుంచి వన్ప్లస్ వెబ్సైట్, అమెజాన్.ఇన్, వన్ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్