telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక వ్యక్తి కారణంగా రాష్ట్రం మొత్తం లాక్ డౌన్… కానీ..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కరోనా గురించి ఎలాంటి వార్తలు చెప్పినా ప్రజలు వణికిపోతున్నారు.  ఓ వ్యక్తి చెప్పిన అబద్దానికి ఓ రాష్ట్రం మొత్తం భయపడింది.  ఆరు రోజులపాటు లాక్ డౌన్ విధించింది.  ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియా స్టేట్ లో జరిగింది.  కరోనా సోకిన వ్యక్తిని అధికారులు ప్రశ్నించగా, తాను ఓ పిజ్జా షాప్ కు ఒక్కసారి వెళ్లాలని, వెళ్లిన తరువాత తనకు కరోనా సోకిందని చెప్పాడు.  దీంతో అధికారులు షాక్ అయ్యారు.  ఒక్కసారి షాపుకు వెళ్తేనే కరోనా సోకింది అంటే వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నదో అధికారులు అర్ధం చేసుకున్నారు. వెంటనే అధికారులు రాష్టంలో ఆరు రోజులపాటు లోక్ డౌన్ విధించారు.  ఒక్క పురుగు కూడా రోడ్డు మీదకు రాకుండా కట్టుదిట్టం చేశారు.  అయితే, కరోనా సోకిన వ్యక్తిని మరోసారి అధికారులు ప్రశ్నించారు.  ఆ సమయంలో అధికారులకు అన్ని విషయాలు చెప్పాడు.  కరోనా సోకిన వ్యక్తి పిజ్జా షాప్ లో పనిచేస్తున్నాడు.  అప్పటికే ఆ షాపులో మరొకరికి కరోనా సోకింది.  అయితే, విషయాలను దాచిపెట్టి అబద్దం చెప్పడంతో అధికారులు సదరు వ్యక్తిపై తీవ్రమైన కోపంతో ఉన్నారు.  కానీ, ఆ వ్యక్తిని శిక్షించలేమని, అందుకు చట్టాలు అనువుగా లేవని అధికారులు చెప్తున్నారు.

Related posts