ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కరోనా గురించి ఎలాంటి వార్తలు చెప్పినా ప్రజలు వణికిపోతున్నారు. ఓ వ్యక్తి చెప్పిన అబద్దానికి ఓ రాష్ట్రం మొత్తం భయపడింది. ఆరు రోజులపాటు లాక్ డౌన్ విధించింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియా స్టేట్ లో జరిగింది. కరోనా సోకిన వ్యక్తిని అధికారులు ప్రశ్నించగా, తాను ఓ పిజ్జా షాప్ కు ఒక్కసారి వెళ్లాలని, వెళ్లిన తరువాత తనకు కరోనా సోకిందని చెప్పాడు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఒక్కసారి షాపుకు వెళ్తేనే కరోనా సోకింది అంటే వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నదో అధికారులు అర్ధం చేసుకున్నారు. వెంటనే అధికారులు రాష్టంలో ఆరు రోజులపాటు లోక్ డౌన్ విధించారు. ఒక్క పురుగు కూడా రోడ్డు మీదకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అయితే, కరోనా సోకిన వ్యక్తిని మరోసారి అధికారులు ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారులకు అన్ని విషయాలు చెప్పాడు. కరోనా సోకిన వ్యక్తి పిజ్జా షాప్ లో పనిచేస్తున్నాడు. అప్పటికే ఆ షాపులో మరొకరికి కరోనా సోకింది. అయితే, విషయాలను దాచిపెట్టి అబద్దం చెప్పడంతో అధికారులు సదరు వ్యక్తిపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. కానీ, ఆ వ్యక్తిని శిక్షించలేమని, అందుకు చట్టాలు అనువుగా లేవని అధికారులు చెప్తున్నారు.
previous post
next post
అతనిచ్చిన లవ్ లెటర్ ను అలా దాచుకుందట… సీక్రెట్ ను బయటపెట్టేసిన కీర్తిసురేష్